Visakhapatnam: అప్పన్నకు ఘనంగా 4వ విడత చందనం సమర్పణ
ABN , First Publish Date - 2022-07-13T14:33:41+05:30 IST
సింహాచలం అప్పన్నకు నాలుగవ విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
విశాఖపట్నం: సింహాచలం అప్పన్నకు నాలుగవ విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది భక్తులు ఇప్పటికే కొండపైకి చేరుకుంటున్నారు.