విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-10-06T13:13:59+05:30 IST

నగరంలోని అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్‌మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

విశాఖపట్నం: నగరంలోని అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్‌మెంట్ వాచ్మెన్ కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత రాత్రి 9 గంటలు నుంచి  కుమార్తె కనబడకపోవడంతో తల్లిదండ్రులు గాలించారు. తాము నివాసముంటున్న పక్క  అపార్ట్‌మెంట్‌లో కుమార్తె శవమై కనిపించింది. అపార్ట్‌మెంట్ నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై దువ్వాడ పోలీసులు అన్వేషిస్తున్నారు. మృతురాలు  ఎనిమిదో తరగతి చదువుతున్న పండ్రంకి పావనిగా గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-06T13:13:59+05:30 IST