శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
ABN , First Publish Date - 2021-10-07T14:09:41+05:30 IST
విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు బాలాత్రిపురసుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.