చిట్టివలస జూట్మిల్ భూములు కాజేయాలని యత్నం: నరసింగరావు
ABN , First Publish Date - 2021-10-07T18:16:44+05:30 IST
చిట్టివలస జూట్ మిల్ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి యాజమాన్యం పెట్టడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింగరావు మండిపడ్డారు.
విశాఖపట్నం: చిట్టివలస జూట్ మిల్ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి యాజమాన్యం పెట్టడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింగరావు మండిపడ్డారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లు ఆస్తులు అమ్మడానికి వీల్లేదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కార్మికులకు చట్టబద్దంగా రావాల్సిన బకాయి ఇప్పటి వరకూ చెల్లించనేలేదని... కానీ కోట్లు విలువచేసే భూములను కాజేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనిపైన మంత్రి అవంతి స్పందించాల్సిన అవసరం ఉందని నరసింగరావు అన్నారు.