టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయం: ప్రణవ్
ABN , First Publish Date - 2021-10-27T16:39:41+05:30 IST
హరిత రిసార్ట్కి వెళ్ళనివ్వకుండా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు.
విశాఖపట్నం: హరిత రిసార్ట్కి వెళ్ళనివ్వకుండా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. వైసీపీ వాళ్ళు జబర్దస్త్ దీక్షలు జాతీయ రహదారిపై చేస్తే వారిని ఏమీ అనరని మండిపడ్డారు. హరిత రిసార్ట్ కొండను ఎలా తవ్వేస్తారని నిలదీశారు. తక్షణమే డీపీఆర్ను విడుదల చేయాలి...లేని పక్షంలో టీడీపీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు.