Visakha: 37 రోజుల పసికందు అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-11-27T18:23:03+05:30 IST

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 37 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Visakha: 37 రోజుల పసికందు అనుమానాస్పద మృతి

విశాఖపట్నం: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 37 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న రాత్రి తల్లిదండ్రుల దగ్గర పడుకున్న పసికందు తెల్లవారేసరికి కనపడకపోవడంతో తల్లితండ్రులు గాలించారు.  చివరకు ఇంట్లోనే వున్న ప్లాస్టిక్ డ్రమ్ములో  పసికందు శవమై తేలింది. డ్రమ్ము కూడా మూతవేసి ఉండటంతో హత్యగా  తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు అప్పలరాజు, సంధ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఏడాదిన్నర క్రితం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-27T18:23:03+05:30 IST