విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా?: జేవీ
ABN , First Publish Date - 2021-09-29T16:53:08+05:30 IST
విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్నం: విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్ట్లోకి నీరు రావడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.