విశాఖ జిల్లాలో గొడుగు దొంగ హల్ చల్
ABN , First Publish Date - 2021-07-07T21:26:57+05:30 IST
విశాఖ జిల్లాలో గొడుగు దొంగ హల్ చల్ చేశాడు. ఎస్బీఐలో అర్థరాత్రి చోరీకి విఫలయ్నం చేశాడు.
విశాఖ: జిల్లాలో గొడుగు దొంగ హల్ చల్ చేశాడు. ఎస్బీఐలో అర్థరాత్రి చోరీకి విఫలయ్నం చేశాడు. అయితే తన ముఖం కెమెరాకు కనిపించకుండా గొడుగును అడ్డు పెట్టుకున్నాడు. గొడుగు దొంగ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కడంతో విషయం బయటపడింది. ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం ఎస్బీఐలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.