ఏవోబీలో బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-06T19:15:42+05:30 IST
విశాఖ ఏవోబీలో బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంద్రసింగ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ సర్వీస్
విశాఖపట్నం: విశాఖ ఏవోబీలో బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంద్రసింగ్ అనే బీఎస్ఎఫ్ జవాన్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జోలపుట్ 15 బెటాలియన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెలవుపై వెళ్లి వచ్చిన జవాన్ నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యారు. కాగా జవాన్ ఇంద్రసింగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.