విశాఖ: లైన్మెన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-07T21:04:41+05:30 IST
లైన్మెన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోరాడ గోవింద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖ: లైన్మెన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోరాడ గోవింద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో బంగార్రాజు హత్యకు గురైనాడు. బంగార్రాజు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భీమునిపట్నం మండలం నమ్మివానిపేటకు చెందిన మొల్లి బంగార్రాజు ఆనందపురం మండలం గొట్టిపల్లిలో విద్యుత్ లైన్మన్గా పనిచేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు, ఆయనకు సన్నిహితంగా వుండే గోవిందరావు కలిసి తన భర్తను హత్య చేశారని బంగార్రాజు భార్య నందినితో పాటు, అతని బంధువులు ఆరోపిస్తున్నారు.