Jagananna ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2022-05-31T21:12:52+05:30 IST

జగనన్న ఇళ్ల కేటాయింపులో జీవీఎంసీ, రిజిస్ట్రేషన్ అధికారులు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Jagananna ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు

Visakha: నగరంలో జగనన్న ఇళ్ల కేటాయింపులో జీవీఎంసీ (GVMC), రిజిస్ట్రేషన్ (Registration) అధికారులు లబ్దిదారుల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ, ప్రకటించిన ప్రభుత్వం.. రూ. వెయ్యి దేనికి వసూలు చేస్తున్నారంటే అధికారులు సమాధానం చెప్పడంలేదు. డాక్యుమెంటేషన్, ఫార్మాలిటీస్‌కు డబ్బులు ప్రభుత్వం భరిస్తుందా?.. లబ్దిదారులే భరించాలని అధికారులు చెబుతున్నారు. అయితే తాము చెల్లించే డబ్బులకు రసీదులు ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఈ వసూళ్ల పర్వం విశాఖ షీలానగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జరిగింది.

Updated Date - 2022-05-31T21:12:52+05:30 IST