విశాఖలో వివాహితకు అత్తింటి వేధింపులు
ABN , First Publish Date - 2021-09-17T17:51:03+05:30 IST
తనను అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నారంటూ విశాఖకు చెందిన శ్యామిలీ అనే వివాహిత భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విశాఖపట్నం: తనను అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నారంటూ విశాఖకు చెందిన శ్యామిలీ అనే వివాహిత భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై భర్త, అత్త వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపింది. తనపై అత్త యాసిడ్ దాడి చేసినట్లు ఆరోపణలు చేసింది. శ్యామిలీ ఛాతి భాగంలో గాయాలు అయినట్లు తెలుస్తోంది. శ్యామిలి భర్త సంతోష్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. గతంలో తన భర్త వేరే ఒక మహిళతో సంబంధంలో ఉన్నాడనే కారణంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లో సంతోష్పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో తనపై కేసు పెట్టాననే కోపంతోనే తనపై దాడికి దిగుతున్నారని బాధితురాలు శ్యామిలి ఆరోపిస్తున్నారు.