ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ

ABN , First Publish Date - 2022-01-23T18:34:24+05:30 IST

ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ

ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ

విశాఖపట్నం: ఉద్యమ కార్యాచరణను విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రకటించింది. ఈ నెల 26న గుంటూరులో, 27న తిరుపతిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ చేపడతామని ఉక్కు పరిరక్షణ కమిటీ తెలిపింది. ఫిబ్రవరి 12న 365 మంది కార్మికులతో నిరాహారదీక్ష చేయనున్నట్లు ఉక్కు పరిరక్షణ కమిటీ పేర్కొంది. విశాఖలో ఫిబ్రవరి 13న బీజేపీ కార్యాలయాలు ముట్టడిస్తామని, ఫిబ్రవరి 23న విశాఖ బంద్ నిర్వహిస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23, 24న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కూడా పాల్గొంటామని కమిటీ చెప్పింది. తమను ఆహ్వానిస్తే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ వెల్లడించింది.

Updated Date - 2022-01-23T18:34:24+05:30 IST