విజయసాయి వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2021-09-04T16:56:52+05:30 IST
విశాఖ సింహాచలంలో, విజయసాయి రెడ్డి కి, పూర్ణకుంభం స్వాగతం, అశోక్ గజపతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింహాచలం తొలి పాంచవ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విశాఖపట్నం: విశాఖ సింహాచలంలో, విజయసాయి రెడ్డి కి, పూర్ణకుంభం స్వాగతం, అశోక్ గజపతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింహాచలం తొలి పాంచవ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి బండారు, పల్లా శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికి అపచారం చేశారని.. సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన, జీవన్ వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.ఇది హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బ తీసినట్లే అని అన్నారు.
పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ... ఒక ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం, ఆలయ సాంప్రదాయం పూర్తి విరుద్ధమని అన్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని.. హిందువుల మనోభావాలు, దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో భూముల వ్యవహారం, టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే, అశోక్ గజపతి మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.