బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం...నిర్వహించి తీరుతామన్న టీడీపీ

ABN , First Publish Date - 2021-03-06T16:05:17+05:30 IST

నగరంలోని నర్సీపట్నంలో టీడీపీ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది.

బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల యత్నం...నిర్వహించి తీరుతామన్న టీడీపీ

విశాఖపట్నం: నగరంలోని నర్సీపట్నంలో టీడీపీ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే బైక్ ర్యాలీని నిర్వహించకూడదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా  నిబంధనలు అనుగుణంగా బైక్ ర్యాలీకి పోలీసుల నుండి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అనుమతులు పొందారు. ఈ క్రమంలో బైక్ ర్యాలీకి అనుమతులు ఉన్నా అడ్డుకోవడంపై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీని ఎలా అనుమతించారని... అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎలా వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ బైక్ ర్యాలీ నిర్వహించి తీరుతామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. 

Updated Date - 2021-03-06T16:05:17+05:30 IST