Visakhapatnam: అల్లూరి విగ్రహానికి కిషన్‌ రెడ్డి, రోజా నివాళి

ABN , First Publish Date - 2022-05-07T16:11:31+05:30 IST

విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు.

Visakhapatnam: అల్లూరి విగ్రహానికి కిషన్‌ రెడ్డి, రోజా నివాళి

విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో అల్లూరి విగ్రహానికి  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది పాటు వాడవాడాలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులార్పిస్తున్నామని అన్నారు. 


మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి పేరు వింటే రొమాలు నిక్క పొడుచుకుంటాయన్నారు. 27 ఏళ్ళకే అమరుడైనా 27తరాలకు ఆయన స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అల్లూరికి మరణం లేదన్నారు. అల్లూరి ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన ఉందని తెలిపారు. అల్లూరి పేరుతో జిల్లా, మన్యం ప్రజల హక్కులు, ఉపాధి , విద్య కోసం అల్లూరి కన్న కలలు సాకారం చేస్తున్నామని అన్నారు. అల్లూరి మ్యూజియం కు 22ఎకరాల స్థలం కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. 

Read more