విశాఖ: అఖిలపక్షం ఆధ్వర్యంలో విష్ణుకుమార్ రాజు నిరసన

ABN , First Publish Date - 2022-03-17T19:56:08+05:30 IST

బార్ అండ్ రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు నిరసన తెలిపారు.

విశాఖ: అఖిలపక్షం ఆధ్వర్యంలో విష్ణుకుమార్ రాజు నిరసన

విశాఖపట్నం: మురళీనగర్‌లో జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టి బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా ఏకమై సాగిస్తున్న ఉద్యమం పట్ల ప్రభుత్వం స్పందించాలన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు చూపి ట్రేడ్ లైసెన్స్ పొందిన అశోకా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై చర్యలు తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-17T19:56:08+05:30 IST