Vishnukumar Raju: అప్పుడు జగన్ పునాదులు కదులుతాయి..

ABN , First Publish Date - 2022-08-24T20:31:46+05:30 IST

విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.

Vishnukumar Raju: అప్పుడు జగన్ పునాదులు కదులుతాయి..

విశాఖ (Visakha): బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లేపాక్షి నాలెడ్జ్ హబ్ (Lepakshi Knowledge Hub) స్ధలాల విషయంలో దోపిడీ జరిగిందని, రాష్ట్రంలో అతి పెద్ద దోపిడీ ఇదేనని అన్నారు. ఈ విషయంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ (AP Governor)  మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో ఏపీ (AP) నేతల ప్రమేయం ఉందన్నారు. ఈ రెండు అంశాలపై సీబీఐ విచారణ (CBI investigation) జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు జగన్ (Jagan) పునాదులు కదులు తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. 

Updated Date - 2022-08-24T20:31:46+05:30 IST