భవిష్యత్ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దు: విష్ణుకుమార్రాజు
ABN , First Publish Date - 2022-03-13T17:13:02+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్రెడ్డి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ బాగుపడాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపిచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే జీవో 36ను ప్రభుత్వం రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.