ఏపీని నాశనం చేయాలని జగన్ చూస్తున్నారు: విష్ణు వర్ధన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-25T18:41:11+05:30 IST

కొత్త జీతాలు వద్దు పాత జీతాలు ముద్దు అంటూ ఇంతవరకు దేశ చరిత్రలో ఉద్యమం చేసింది లేదని...

ఏపీని నాశనం చేయాలని జగన్ చూస్తున్నారు: విష్ణు వర్ధన్ రెడ్డి

విజయవాడ: కొత్త జీతాలు వద్దు పాత జీతాలు ముద్దు అంటూ ఇంతవరకు దేశ చరిత్రలో ఉద్యమం చేసింది లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలన అంతా రివర్స్‌లా ఉందని విమర్శించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి 30 నెలలైనా కొత్త ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. మద్యం ధరలు పెంచి మహిళలకు అన్యాయం చేశారన్నారు. ఏపీలో జగన్‌కు ఇది మొదటి.. చివరి పాలన.. మళ్లీ అధికారంలోకి రామని తెలిసి.. ఆర్ధికంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో ఆర్ధికంగా నష్టపరిచారని, ఏపీని జూదగాళ్ల రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు రివర్స్ కేసులతో బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. జగన్ రివర్స్ పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-25T18:41:11+05:30 IST