
కడప: కరెంట్ కోతలతో సీఎం సొంత జిల్లాలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న..వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని విష్ణువర్థన్రెడ్డి డిమాండ్ చేశారు.