‘విశ్వకర్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2021-07-27T04:32:36+05:30 IST

‘విశ్వకర్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’

‘విశ్వకర్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’
కార్యక్రమంలో మాట్లాడుతున్న జగన్నాథం

తాండూరు : రాష్ట్ర విశ్వకర్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు కౌలు జగన్నాథం అన్నారు. సోమవారం తాండూరులో జరిగిన సంఘం ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50ఏళ్లు నిండిన సంఘం ప్రతినిధులకు పెన్షన్‌ ఇవ్వాలని, తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలని, కోత మిషన్లు ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీ మధులత, మాజీ కౌన్సిల్‌ యాదగిరిచారి, పులిందర్‌చారి, శ్వినాథ్‌పూర్‌ బ్రహ్మచారి, లక్ష్మణ్‌చారి, కందనెల్లి వడ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం కౌలు గజన్నాథం, వైస్‌ ఎంపీపీ మధులతను సన్మానించారు.

Updated Date - 2021-07-27T04:32:36+05:30 IST