AP: శ్రావణ మాసం రెండవ శుక్రవారం...ఆలయాల్లో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-08-20T13:41:28+05:30 IST
శ్రావణ మాసం రెండోవ శుక్రవారం కావడంతో నగరంలోని దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
విశాఖపట్నం: శ్రావణ మాసం రెండోవ శుక్రవారం కావడంతో నగరంలోని దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ కనక మహాలక్ష్మీ, శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించడానికి కుటుంబ సమేతంగా భక్తులు తరలి వస్తున్నారు.