విస్తారా విమానాల్లో passengers ఇక వేడి వేడి భోజనం

ABN , First Publish Date - 2021-10-22T16:47:55+05:30 IST

విస్తారా దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఇక వేడి వేడి భోజనం వడ్డించాలని నిర్ణయించారు...

విస్తారా విమానాల్లో passengers ఇక వేడి వేడి భోజనం

న్యూఢిల్లీ : విస్తారా దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఇక వేడి వేడి భోజనం వడ్డించాలని నిర్ణయించారు. దేశీయ విమానయాన సంస్థ అయిన విస్తారా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణికులకు వేడిగా శాకాహార భోజనాన్ని తిరిగి ప్రారంభించింది. కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి వీలుగా విస్తారా వేడి వేడి వేడిగా భోజనాన్ని ముందుగా ప్యాక్ చేసి స్నాక్స్ తో అందించాలని నిర్ణయించింది. దేశంలో 100 కోట్ల మంది భారతీయులు కొవిడ్ టీకాలు వేయించుకున్నందున విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికులకు వేడి వేడిగా భోజనం అందించాలని నిర్ణయించారు. మసాలా ఉత్తప్పం, వడ, సాంబార్‌తో ఇడ్లీ లాంటి అల్పాహారాలు అందించనున్నారు. 





 లంచ్, డిన్నర్ ఎంపికల్లో దాల్ మఖానీతో వెజిటబుల్ బిర్యానీ, చనా మసాలాతో జీరా పులావ్ వడ్డించనున్నారు.  భాజీతో మసాలా పావ్, నూడుల్స్‌ను విమానాల్లో స్నాక్స్‌గా అందించనున్నారు.విస్తారా ఇటీవల స్కైట్రాక్స్ వార్షిక రేటింగ్‌లలో భారతదేశంలోనే ఉత్తమ విమానయాన సంస్థగా మధ్య ఆసియా అవార్డును గెలుచుకుంది. విమాన క్యాబిన్ పరిశుభ్రత ,భద్రతా ప్రమాణాలకు కూడా విస్తారా ప్రశంసలు అందుకుంది.

Updated Date - 2021-10-22T16:47:55+05:30 IST