వివేకా హత్య కేసు నిందితులు అరెస్ట్ చేయాలి: నక్కా

ABN , First Publish Date - 2021-11-14T21:40:41+05:30 IST

మాజీమంత్రి వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తేలిపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తెలిపారు.

వివేకా హత్య కేసు నిందితులు అరెస్ట్ చేయాలి: నక్కా

గుంటూరు: మాజీమంత్రి వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తేలిపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దస్తగిరి చెప్పిన వారిని అందరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలోనే ఉన్నారని, జగన్ అమిత్ షాకు చెప్పి వివేకా హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయించాలన్నారు. సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజు గుండె పోటు అని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్కడా దాక్కున్నాడని ఎద్దేవాచేశారు. రోజు కారు కూతలు కూసే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన కోడి కత్తి కేసు ఏంమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కోడి కత్తి కేసును ఎందుకు వదిలేశారని తప్పుబట్టారు. నేర పూరిత వ్యక్తులు రాజ్యాలు ఏలితే పరిస్థితులు ఇలానే ఉంటాయని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-14T21:40:41+05:30 IST