అర్ధరాత్రి నుంచి పులివెందులలో తిరుతున్న సీబీఐ టీమ్

ABN , First Publish Date - 2021-07-28T19:42:28+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఎవరిని ఎప్పుడు అదుపులోకి...

అర్ధరాత్రి నుంచి పులివెందులలో తిరుతున్న సీబీఐ టీమ్

కడప జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారోనని అనుమానితులంతా టెన్షన్ పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి పులివెందుల ప్రాంతంలో సీబీఐ బృందం తిరుగుతోంది. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు సునీల్ బంధువు యువరాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని బుధవారం జమ్మలమడుగు కోర్టుకు తీసుకువెళుతున్నట్లు సమాచారం. ఇంతవరకు సీబీఐ అధికారులు విచారించిన వందలమందిలో ఈ యువరాజు లేరు. కొత్తగా ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరికొందరిలో టెన్షన్ నెలకొంది.

Updated Date - 2021-07-28T19:42:28+05:30 IST