వివేకా హత్య కేసు..దస్తగిరి వాంగ్మూలంపై సహచర నిందితుల అభ్యంతరం
ABN , First Publish Date - 2022-01-21T15:57:23+05:30 IST
వివేకా హత్యకేసు నిందితుల మధ్య కొనసాగుతున్న వివాదం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కడప జిల్లా: వైఎస్ వివేకా హత్యకేసు నిందితుల మధ్య కొనసాగుతున్న వివాదం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏ4 నిందితుడు డ్రైవర్ దస్తగిరి 164 వాంగ్మూలంపై సహచర నిందితులు మొదటి నుంచి అభ్యంతరం చెబుతున్నారు. దస్తగిరి అప్రూవర్గా మారడానికి అనుమతినిచ్చిన కోర్టు ఉత్తర్వులపై కూడా సహచర నిందితులు ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు అబ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వాళ్లు వేసిన పిటిషన్పై గురువారం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.