రేపు వివేకానంద సేవా సమితి భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-28T05:48:28+05:30 IST
రేపు వివేకానంద సేవా సమితి భవనం ప్రారంభం
భీమవరం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): భీమవరం సమీపంలోని పెద అమిరంలో స్వామి వివేకానంద సేవా సమితి నూతన భవనాన్ని రామకృష్ణ మిషన్ ఉపాధ్యక్షుడు స్వామీ గౌతమానంద మహరాజ్ బుధవారం ప్రారంభిస్తారు. భవనంలో శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం, శారదాదేవి సమా వేశం మందిరం, వివేకానంద వ్యక్తిత్వ వికాస ప్రాంగణ, సమితి కార్యాల యం, సాధువుల వసతి గదులను నిర్మించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణస్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రంలో ఉన్న రామకృష్ణ మిషన్, మఠాలకు చెందిన అధ్యక్ష, కార్య దర్శులు ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు భీమవరం వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు పి.పి.సోమరాజు, డి.నారాయణరాజు తెలిపారు. శోభాయాత్రతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.