Wife Left Husband: నేను ప్రియుడితోనే ఉంటా.. విడదీస్తే చచ్చిపోతా.. అచ్చం Sai Priya ఉదంతమే మరో చోట రిపీట్..!

ABN , First Publish Date - 2022-07-29T18:02:50+05:30 IST

సాయి ప్రియా(Vizag Sai Priya).. ఈ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. భర్తతో కలిసి బీచ్ వెళ్లిన ఆమె.. అనూహ్యంగా కనబడకుండా పోవడంతో ప్రభుత్వం స్పందించడం.. సుమారు కోటి రూపాయలు ఖర్చు చే

Wife Left Husband: నేను ప్రియుడితోనే ఉంటా.. విడదీస్తే చచ్చిపోతా.. అచ్చం Sai Priya ఉదంతమే మరో చోట రిపీట్..!

ఇంటర్నెట్ డెస్క్: సాయి ప్రియ(Vizag Sai Priya).. ఈ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. భర్తతో కలిసి బీచ్ వెళ్లిన ఆమె.. అనూహ్యంగా కనబడకుండా పోవడంతో ప్రభుత్వం స్పందించడం.. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి మరీ సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. కట్ చేస్తే.. తాను తన ప్రియుడితో పారిపోయి అతడిని పెళ్లి చేసుకున్నానని.. తన కోసం వెతకొద్దని వాట్సప్ మెసేజ్ ద్వారా ఆమె తన తల్లికి చెప్పింది. అంతేకాకుండా చావైనా బతుకైనా తన ప్రియుడితేనే అని చెప్పిన Sai Priya.. విడదీయాలని ప్రయత్నిస్తే చనిపోవడానికైనా సిద్ధమే అంటూ హెచ్చరించింది. కాగా.. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. దాదాపు ఇటువంటి ఘటనే మరో చోట రిపీట్ అయింది. ప్రియుడితో కలిసి పారిపోయిన వివాహిత.. Vizag Sai Priyaలాగే బెదిరింపులకు పాల్పడుతోంది. బిహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని (Bihar) భోజ్‌పూర్ జిల్లాకు చెందిన చింతా కుమారి(Chinta Kumari) అనే యువతికి ఏడాది క్రితం బక్సార్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి బాగానే ఉన్న ఆమె.. తాజాగా అతడికి షాకిచ్చింది. భోజనం చేసి నిద్రపోయిన తర్వాత ఇంట్లోంచి పారిపోయింది. ఉదయం నిద్ర లేచే సరికి ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అతడు కంగుతిన్నాడు. వెంటనే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిజేసి.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. యువతి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే భోజ్‌పూర్‌కు కొంత దూరంలో చింతా కుమారి.. మంజిత్ కుమార్ అనే యువకుడితో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌(Police Station)కు తరలించారు. అనంతరం చింతా కుమారి తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం అందించారు. 



ఈ క్రమంలో భర్త సహా చింతా కుమారి తల్లిదండ్రలు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా యువతి మాటలు విని వాళ్లు షాకయ్యారు. మంజిత్ కుమార్‌ను కొన్నేళ్లుగా Love చేస్తున్నట్టు చెప్పింది. అతడు కూడా తనను ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. తమ ప్రేమ విషయం చెబితే ఏమంటారో అని భయపడి ఇంట్లో చెప్పలేదని తెలిపింది. ఈ క్రమంలోనే తనకు పెళ్లి జరిపించారని పేర్కొంది. పెళ్లైన తర్వాత మంజిత్ కుమార్‌తో టచ్‌లో లేనని చెప్పింది. అయితే తన భర్త తనను రోజూ చిత్ర హింసలకు గురి చేయడంతో.. అతడితో కలిసి బతకలేక తిరిగి మంజిత్ కుమార్‌ను సంప్రదించినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే తామిద్దరం పారిపోయినట్టు వివరించింది. అంతేకాకుండా తాను తన ప్రియుడితోనే కలిసి బతుకుతానని స్పష్టం చేసింది. ఎవరైనా తమను విడదీయాలని చూస్తే చచ్చిపోతామని బెదిరించింది. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-29T18:02:50+05:30 IST