స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తెలంగాణ మావోయిస్టు పార్టీ మద్దతు

ABN , First Publish Date - 2021-03-08T21:09:08+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.

స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి తెలంగాణ మావోయిస్టు పార్టీ మద్దతు

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఈ లేఖ విడుదలైంది. దేశ సంపదను సామ్రాజ్యవాద శక్తులకు కేంద్రం ధారదత్తం చేస్తోందని లేఖలో మండిపడింది. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్నం పెట్టే రైతులను బిచ్చగాళ్లని చేయాలని కుట్ర జరుగుతోందని మావోయిస్టులు పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం చేసే కార్మికులు, రైతులను, దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉక్కు కార్మికులకు, ప్రజలకు మావోస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.  



Updated Date - 2021-03-08T21:09:08+05:30 IST