Vizianagaram Bc Ninadham: విజయనగరంలో మళ్లీ తెరపైకి బీసీ నినాదం?

ABN , First Publish Date - 2022-09-05T23:29:08+05:30 IST

వైసీపీ (Ycp)లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి వైసీపీ సీనియర్ నేత పిళ్లా విజయకుమార్ధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. ....

Vizianagaram Bc Ninadham: విజయనగరంలో మళ్లీ తెరపైకి బీసీ నినాదం?

విజయనగరం (Vizianagaram): వైసీపీ (Ycp)లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి (Mla Kolagatla VeeraBhadra Swamy), వైసీపీ సీనియర్ నేత పిళ్లా విజయకుమార్ (Pilla Vijaykumar) మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోలగంట్ల వ్యతిరేక వర్గాన్ని విజయకుమార్ తన వెంట తిప్పుకోవడం ప్రారంభించారట. దీంతో ఇరువురి మధ్య రాజకీయ వైషమ్యాలు విపరీతంగా పెరిగిపోయాయట. 



ఇదిలా ఉంటే విజయ్ కుమార్ కొన్నాళ్ల నుంచి బీసీ నినాదం (Bc Ninadham) భుజానకెత్తుకున్నారట. విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకే కేటాయించాలని కోరుతున్నారట. మంత్రి బొత్సను కలసి ఇదే విషయాన్నిచెప్పారట. అయితే మంత్రి బొత్స నుంచి ఊహించని పరిణామం ఎదురైందట. వైసీపీలో ఉన్న వారందరూ ఒకటేనని.. ఇలాంటివి పునరావృతం చేయొద్దని వార్నింగ్‌ ఇచ్చారట. అయినా విజయనగరం నియోజకవర్గాన్ని బీసీలకే కేటాయించాలని కోలగట్ల వ్యతిరేక వర్గం పట్టుబడుతోందట. అటు తనను ఎదిరించిన వారిని ఎలా నిలువరించాలో బాగా తెలుసని ఎమ్మెల్యే కోలగట్ల కౌంటర్‌ ఎటాక్‌ చేశారట. తనను వ్యతిరేకించే వారి దగ్గర పట్టుమని పది ఓట్లు కూడా లేవని ఎమ్మెల్యే కోలగట్ల కొట్టిపారేశారట. 


ఇక ఎమ్మెల్యే కోలగట్లం, సీనియర్ నేత పిళ్లా విజయ్ కుమార్ మధ్య ఆదిపత్య పోరుతో విజయనగరం అసెంబ్లీ సీటు వ్యవహారం ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే హీటెక్కిస్తోంది. మరి వీరి మధ్య అధిపత్య పోరుకు అధిష్టానం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి. 




Updated Date - 2022-09-05T23:29:08+05:30 IST