వీఎంసీలో పలువురు అధికారులు బదిలీ
ABN , First Publish Date - 2022-07-02T07:05:13+05:30 IST
నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపరింటెంగింగ్ ఇంజనీర్ పీవీకే ప్రభాకర్ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈగా బదిలీ చేసింది.
చిట్టినగర్, జూలై 1 : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూపరింటెంగింగ్ ఇంజనీర్ పీవీకే ప్రభాకర్ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో అమరావతి డెవల్పమెంట్ కార్పొరేషన్లో సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కె.రామ్మెహన్రావు బదిలీపై వచ్చారు. వెహికల్ డిపోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న కె.కోటేశ్వరరావు నరసరావు పేట మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అమరావతి డెవల్పమెంట్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పని చేస్తున్న జె.శ్రీనివాస్, ఆదోని మున్సిపాలిటీలో ఎగ్జిటివ్ ఇంజర్గా పనిచేస్తున్న ఏ.సత్యనారాయణలు బదిలీపై నగరానికి వచ్చారు. అలాగే సర్కిల్-2 జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న కె.వి.ఆర్ఆర్ రాజు కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ వడ్డేశ్వరం మున్సిపల్ కమిషనర్గా గ్రేడ్-3 బదిలీ అయ్యారు. పీర్వో సెక్షన్ ఇన్చార్జీగా పని చేస్తున్న డీ.వీ.ఎ్స.నారాయణరావును కనిగిరి మున్సిపాలిటీ కమిషనర్గా బది లీ అయ్యారు. గుంటూరు కార్పొరేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న కె.వసంతలక్ష్మి వీఎంసీ సెక్రటరీగా, మెప్మాలో మిషన్ మేనేజర్గా పని చేస్తున్న కె.శకుంతల యూసీడీ అధికారిగా బదిలీపై వచ్చారు.