రైల్వేకోడూరులో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-22T10:17:16+05:30 IST

కరోనా ఉధృతితో వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాపార సంస్థలను మూసివేశారు.

రైల్వేకోడూరులో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

  • మధ్యాహ్నం 2 గం. నుంచి దుకాణాల బంద్‌

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 21: కరోనా ఉధృతితో వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాపార సంస్థలను మూసివేశారు. వస్త్ర, కిరాణా, బంగారు, షూమార్టు, కుదవ తదితర దుకాణాలను బంద్‌ చేశారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గేంత వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ఉంటుందని వ్యాపార సంఘాలు ప్రకటించాయి. కరోనా బారిన ప్రజలు పడకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మర్చంట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మందల రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి మేడా వెంకటసుబ్బయ్య, రెడీమేడ్‌ దుకాణాల అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీ క్రిష్ణ, కుదవ వ్యాపార సంఘాలు, బంగారు దుకాణాల అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట యుగంధర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-22T10:17:16+05:30 IST