నేటి నుంచి ఎలమంచిలిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-24T05:25:09+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలమంచిలి పట్టణంలోని పలు రంగాలకు చెందిన వ్యాపారులు శనివారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించనున్నారు.

నేటి నుంచి ఎలమంచిలిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌


 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే వ్యాపారాలు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 23 : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలమంచిలి పట్టణంలోని పలు రంగాలకు చెందిన వ్యాపారులు శనివారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించనున్నారు. ఇందులో భాగంగా  రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యాపారాలు సాగించాలని సమావేశంలో తీర్మానించినట్టు బాలాజీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.జానకిరామ్‌ తెలిపారు.  వినియోగదారులంతా కొవిడ్‌ నిబంధనలు పాటి స్తూనే ఇందుకు సహకరించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

Updated Date - 2021-04-24T05:25:09+05:30 IST