ఈ ఉద్యోగమే తనకు వద్దంటూ చెప్పుతో కొట్టుకున్న వలంటీర్..

ABN , First Publish Date - 2022-06-21T15:25:08+05:30 IST

నగేష్ నాయక్ అనే వలంటీర్ తన చెప్పుతో తనే కొట్టుకున్న ఘటన కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో జరిగింది.

ఈ ఉద్యోగమే తనకు వద్దంటూ చెప్పుతో కొట్టుకున్న వలంటీర్..

శ్రీ సత్యసాయి : నగేష్ నాయక్ అనే వలంటీర్ తన చెప్పుతో తనే కొట్టుకున్న ఘటన కదిరి(Kadiri) మండలం రామదాస్ నాయక్ తండాలో జరిగింది. గ్రామంలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే.. ఒక్క రైతుకే పంట బీమా అందింది. అయితే తమకెందుకు పంటల బీమా రాలేదంటూ మిగిలిన రైతులు నిలదీశారు. వలంటీర్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సచివాలయ(Secretariat) సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఊళ్లోకి వెళ్తే రైతులు చెప్పుతో కొట్టేలా ఉన్నారని.. తన చెప్పుతో తాను కొట్టుకోవడం మేలంటూ చెప్పుతో కొట్టుకున్నాడు. వలంటీర్ ఉద్యోగమే తనకు వద్దని.. రాజీనామా చేస్తానన్నారు. రైతులకు పంటల బీమా ఇవ్వండంటూ అధికారులతో ఆవేదన వ్యక్తం చేశారు.



Updated Date - 2022-06-21T15:25:08+05:30 IST