చోడవరంలో వ్యాపారుల స్వచ్ఛంద లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-24T04:38:05+05:30 IST
కరోనా కేసులు తీవ్రం కావడంతో పట్టణంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై తగ్గిన జన సంచారం
చోడవరం, ఏప్రిల్ 23: కరోనా కేసులు తీవ్రం కావడంతో పట్టణంలో శుక్రవారం నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. వర్తక వాణిజ్య సంఘం పిలుపు మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ దుకాణాలు తెరిచారు. అనంతరం వ్యాపారులు స్వచ్ఛందంగానే తాళాలు వేసేశారు. దుకాణాలు మూతపడడంతో ప్రధాన రహదారిపై జన సంచారం తగ్గిపోయింది.
నేటి నుంచి వడ్డాదిలో లాక్డౌన్
బుచ్చెయ్యపేట: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటంతో శనివారం నుంచి వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు తీసి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు.