గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ అత్యాచారం

ABN , First Publish Date - 2021-11-06T16:18:45+05:30 IST

వీరఘట్టం మండలంలో దారుణం చోటు చేసుకుంది. నడుకూరులోని గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ అత్యాచారం

శ్రీకాకుళం: వీరఘట్టం మండలంలో దారుణం చోటు చేసుకుంది. నడుకూరులోని గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పులు వస్తుంటడంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-06T16:18:45+05:30 IST