వాలెంటీర్‌పై దాడి చేసిన మహిళలు

ABN , First Publish Date - 2020-07-07T03:16:57+05:30 IST

నరసరావుపేటలో 20వ వార్డు వాలెంటీర్‌పై స్థానిక ప్రజలు దాడి చేశారు. వాలెంటీర్ శివరాత్రి శ్రీను, అతని కుటుంబ సభ్యులపై స్థానిక మహిళలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తమకు ఇళ్ల స్థలాలు

వాలెంటీర్‌పై దాడి చేసిన మహిళలు

గుంటూరు: నరసరావుపేటలో 20వ వార్డు వాలెంటీర్‌పై స్థానిక ప్రజలు దాడి చేశారు. వాలెంటీర్ శివరాత్రి శ్రీను, అతని కుటుంబ సభ్యులపై స్థానిక మహిళలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తమకు ఇళ్ల స్థలాలు రాకపోవడానికి శ్రీనునే కారణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో శ్రీను, అతని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహానికి గురై అందరూ కలిసి అతనిపై అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిగా సదరు మహిళలు కూడా శ్రీనుపై ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-07-07T03:16:57+05:30 IST