వాలెంటీర్పై దాడి చేసిన మహిళలు
ABN , First Publish Date - 2020-07-07T03:16:57+05:30 IST
నరసరావుపేటలో 20వ వార్డు వాలెంటీర్పై స్థానిక ప్రజలు దాడి చేశారు. వాలెంటీర్ శివరాత్రి శ్రీను, అతని కుటుంబ సభ్యులపై స్థానిక మహిళలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తమకు ఇళ్ల స్థలాలు
గుంటూరు: నరసరావుపేటలో 20వ వార్డు వాలెంటీర్పై స్థానిక ప్రజలు దాడి చేశారు. వాలెంటీర్ శివరాత్రి శ్రీను, అతని కుటుంబ సభ్యులపై స్థానిక మహిళలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తమకు ఇళ్ల స్థలాలు రాకపోవడానికి శ్రీనునే కారణమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో శ్రీను, అతని కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహానికి గురై అందరూ కలిసి అతనిపై అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిగా సదరు మహిళలు కూడా శ్రీనుపై ఫిర్యాదు చేశారు.