కళ్యాణదుర్గం ఓటర్లు 2,22,724

ABN , First Publish Date - 2021-11-03T06:23:48+05:30 IST

నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైనట్లు ఆర్డీఓ నిశాంతరెడ్డి తెలిపారు.

కళ్యాణదుర్గం ఓటర్లు 2,22,724

ఆర్డీఓ నిశాంతరెడ్డి వెల్లడి

కళ్యాణదుర్గం, నవంబరు2: నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైనట్లు ఆర్డీఓ నిశాంతరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితాను తహసీల్దార్‌ బ్రహ్మయ్య, ఎన్నికల డీటీ శ్రీనాథ్‌రెడ్డిలకు అందజేశారు. 2022 ఏడాదికి సంబంధించి 222724 ఓటర్ల నమోదైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. స్థానిక రెవెన్యూ డివిజన కార్యాలయంలో బూతలెవెల్‌ అధికారులతో కలిసి ఓటర్ల జాబితాను మండలాల వారిగా విడుదలచేశారు. 2022 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారితోపాటు 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు కాని వారు ఈనెల ఆఖరిలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 8వ తేదీలోగా చేర్పులపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.


Updated Date - 2021-11-03T06:23:48+05:30 IST