వీఆర్వోల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-04-18T06:14:35+05:30 IST
గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డివిజన్ సమావేశం ఎన్జీవో హోమ్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం ఆధ్వర్యంలో శనివారం జరిగింది.
గుడివాడ రూరల్ : గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డివిజన్ సమావేశం ఎన్జీవో హోమ్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం ఆధ్వర్యంలో శనివారం జరిగింది. వీఆర్వోల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. వీఆర్వోల సంఘ నిర్మాణం బలోపేతం కావడానికి అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో పదోన్నతులు సక్రమంగా నిర్వహించాలని కోరారు. నామినీలుగా పని చేయుచున్న వారిని రెగ్యులర్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ తదితర విషయాలు చర్చించారు. మండల సంఘ అధ్యక్షుడు ఎం.శేఖరరావు, మాణిక్యం, బసవయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.