ఆటో ఢీకొని సైక్లిస్ట్‌ మృతి

ABN , First Publish Date - 2021-03-06T07:23:40+05:30 IST

జాతీయ రహదారిపై నాతయ్యపాలెం బస్టాప్‌వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆటో ఢీకొని సైక్లిస్ట్‌ మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారావు

అక్కిరెడ్డిపాలెం, మార్చి 5: జాతీయ రహదారిపై నాతయ్యపాలెం బస్టాప్‌వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.   మింది కాలనీకి చెందిన మంగరాజు కృష్ణారావు(45) షీలానగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి నైట్‌ డ్యూటీకి సైకిల్‌పై ఇంటి నుంచి వస్తుండగా నాతయ్యపాలెం బస్టాప్‌ వద్దకు వచ్చేసరికి ఆటో బలంగా ఢీ కొట్టింది. దీంతో రహదారిపై పడిపోయిన కృష్ణారావు తలకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణారావును స్థానికులు చికిత్స నిమిత్తం కేజిహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.  గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-06T07:23:40+05:30 IST