కొత్తగా ఎనిమిది కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-03T06:22:00+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 60,549కు చేరాయి. వీరిలో 59,980 మంది కోలుకోగా, మరో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 539 మంది మృత్యువాత చెందారు.
1583 మందికి కొవిడ్ వ్యాక్సిన్
జిల్లాలో మంగళవారం 1583 మంది కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో విడతలో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారు 419 మంది కాగా, వీరిలో 60 ఏళ్లు పైబడిన వారు 321 మంది, 45-59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 98 మంది ఉన్నారు. ఆరోగ్య సిబ్బంది 201 మంది, మిగిలిన శాఖలకు చెందిన ఫ్రంట్లైన్ వర్కర్లు 651 మంది మొదటి డోసు తీసుకున్నారు. మరో 312 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోసు తీసుకున్నారు.