ఉత్తర టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ

ABN , First Publish Date - 2021-03-03T06:17:06+05:30 IST

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం తన స్వగృహంలో బీ ఫారాలు అందజేశారు

ఉత్తర టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ
అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం తన స్వగృహంలో బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కొక్క వార్డులో ఇద్దరు ముగ్గురు టికెట్‌ ఆశించగా, ఒక్కరికే పార్టీ అవకాశం కల్పించిందని, అంతా కలిసి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి విజయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-03T06:17:06+05:30 IST