పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-23T08:04:20+05:30 IST

కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పరవాడ, సెప్టెంబరు 22: కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడ పోతల వారి చేలల్లో నివాసముంటున్న బండారు వెంకటరావు(35) అనే వ్యక్తి కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.


తాగొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో వెంకటరావు మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం ఇంట్లో తలుపు వేసుకుని పురుగుల మందు తాగేశాడు. కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో తలుపులు తీశాడు. వెంటనే అతన్ని కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు వున్నారు. పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-23T08:04:20+05:30 IST