ఆర్టీసీ ఆదాయానికి రూ.70 లక్షలు గండి

ABN , First Publish Date - 2021-03-06T07:24:57+05:30 IST

బంద్‌ కారణంగా మధ్యాహ్నం వరకూ బస్సులను నడపకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి జిల్లాలో రూ.70 లక్షలు నష్టం వాటిల్లింది.

ఆర్టీసీ ఆదాయానికి రూ.70 లక్షలు గండి

విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): బంద్‌ కారణంగా మధ్యాహ్నం వరకూ బస్సులను నడపకపోవడంతో ఆర్టీసీ ఆదాయానికి జిల్లాలో రూ.70 లక్షలు నష్టం వాటిల్లింది. జిల్లాలోని పది డిపోల పరిధిలో 1064 బస్సులు ఉండగా, రోజుకి రూ.1.05 కోట్ల ఆదాయం వస్తుంది. బంద్‌ కారణంగా శుక్రవారం రూ.35 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-06T07:24:57+05:30 IST