ఉక్కు ఉద్యోగులకు ప్లాంట్లో వ్యాక్సిన్ వేయాలి
ABN , First Publish Date - 2021-04-24T05:12:21+05:30 IST
ఉక్కు ఉద్యోగులకు ప్లాంట్లో వ్యాక్సిన్ వేయాలని ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు కేఎస్ఎన్ రావు అన్నారు.
ఉక్కుటౌన్షిప్, ఏప్రిల్ 23: ఉక్కు ఉద్యోగులకు ప్లాంట్లో వ్యాక్సిన్ వేయాలని ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు కేఎస్ఎన్ రావు అన్నారు. ప్లాంట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ను పంపడం స్టీల్ప్లాంట్కు గర్వకారణమన్నారు. అయితే ఇలాంటి స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉక్కు జనరల్ ఆస్పత్రిలో కొవిడ్కు నిరంతరం వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.రామకృష్ణ, నరేష్కుమార్, జయ, అప్పారావు, యేల్లేటి శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్, నాయుడు, టి.కనకరాజు పాల్గొన్నారు.