పోలీసుల అతి ప్రవర్తన కట్టడి చేయండి

ABN , First Publish Date - 2021-03-02T06:33:11+05:30 IST

ఎన్నికల ప్రచారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఫిర్యాదు చేశారు.

పోలీసుల అతి ప్రవర్తన కట్టడి చేయండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు

ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించిన అనంతరం కమిషనర్‌కు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఐదుగురితో వార్డుల్లో ప్రచారం చేస్తే అభ్యంతరం తెలుపుతున్న పోలీసులు, వైసీపీ నాయకుల విషయానికి వచ్చేసరికి భారీ ఊరేగింపునకు బందోబస్తు ఇవ్వడం దారుణమన్నారు. ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకే నిబంధన ఉండాలని పేర్కొన్నారు. మునిసిపల్‌, జీవీఎంసీ ఎన్నికలలో పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో కెమెరాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనకాపల్లి పఽరిధి 80వ వార్డులో 1600 ఓట్ల గల్లంతుపై విచారణ చేయాలని కోరారు. 



Updated Date - 2021-03-02T06:33:11+05:30 IST