మోటార్బైక్లు ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-07-08T03:12:56+05:30 IST
ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్బైక్లు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు.ఈ సంఘటన గురువారం మం
వరికుంటపాడు, జూలై 7: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్బైక్లు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు.ఈ సంఘటన గురువారం మండలంలోని గణేశ్వరాపురం గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు, దుత్తలూరు మండలం కొత్తపేటకి చెందిన పురుషోత్తం రవి(33) గణేశ్వరాపురం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. అలాగే మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లి కి చెందిన గడుసందు హరి తన కుటుంబంతో బైక్పై వింజమూరు నుంచి గ్రామానికి వస్తున్నాడు.ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువా తపడ్డాడు. హరి సహ కుటుంబీకులు కూడా గాయపడ్డారు. ఈ మేరకు ఎస్ఐ బాలమహేంద్రనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.