పౌష్టికాహారం కిట్లు పంపిణీ
ABN , First Publish Date - 2020-09-23T11:36:01+05:30 IST
గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మంగళ వారం సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు.
మెరకముడిదాం, సెప్టెంబరు 22: గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మంగళ వారం సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని శింగవరంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.