ఏఐటీయూసీ నిరసన
ABN , First Publish Date - 2020-09-29T12:01:27+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ నిరసించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ కోరారు. ఈ మేరకు సోమవారం లోయర్ ట్యాంకు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దాసన్న పేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ నిరసించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ కోరారు. ఈ మేరకు సోమవారం లోయర్ ట్యాంకు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సర్కార్ కార్పొరేట్ల జపంతో తరించిపోతుందన్నారు.
దీనిలో భాగంగా ప్రజా కార్మిక రైతులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మోదీ సర్కార్ ఈ చర్యలను ఉపసంహరించుకోకపోతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ ప్రతినిధులు రంగరాజు, జీవన్, అప్పన్న, జగన్నాఽథం పాల్గొన్నారు.